ఏఐసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ రాజకీయంగానే కాదు, అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో బీహార్ కు చెందిన సోకాల్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి రూ. 450 కోట్లతో భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ దాసోజు చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న ఆయా ఐఏఎస్ అధికారి ఎవరనే విషయం తెలంగాణా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు. తాను చేసిన ట్వీట్ ను సీబీఐ, ఏసీబీ విభాగాలకు దాసోజు ట్యాగ్ చేయడం విశేషం. అయితే దాసోజ్ శ్రవణ్ తన ట్వీట్ ద్వారా ఉటంకించిన ఆ ఐఏఎస్ అధికారి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణాలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన ఐఏఎస్ అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాసోజ్ శ్రవణ్ ప్రస్తావించిన బీహార్ ఐఏఎస్ అధికారి ఎవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version