Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్… గల్లంతైన 17 మంది పోలీసుల మృతి

    ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్… గల్లంతైన 17 మంది పోలీసుల మృతి

    March 22, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 cg en

    ఛత్తీస్ గఢ్ అడవుల్లో గల్లంతైన 17 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో 12 మంది డీఆర్జీ, ఐదుగురు ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన భద్రతా బలగాలుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజన్ కొద్ది సేపటి క్రితం ధృవీకరించారు. మావోయిస్టు నక్సలైట్లకు, పోలీసులకు మధ్య నిన్న రాత్రి పొద్దుపోయాక జరిగిన భీకర పోరులో కొందరు పోలీసుల ఆచూకీ లేకుండా పోయింది. ఎన్కౌంటర్ సమయంలో గల్లంతైన పోలీసుల సంఖ్య తొలుత 13గా సమాచారం. అయితే మరణించిన పోలీసుల మృతదేహాలు లభ్యమైన అనంతరం వీరి సంఖ్య 17గా ఛత్తీస్ గఢ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ అడవుల్లో మావోయిస్టు నక్సలైట్ల గాలింపు చర్యలకు దాదాపు 550 మంది భద్రతా బలగాలు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. మొత్తం 17 మంది పోలీసులు మరణించగా, గాయపడిన మరో 15 మంది పోలీసులకు రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. వీరిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

    Previous Articleఆ 13 మంది ఆచూకీ ఇంకా లేదు… గాయపడిన జవాన్ల దృశ్యాలు ఇవే!
    Next Article ‘జనతా కర్ఫ్యూ’ దృశ్యాలు… ఏరియల్ వ్యూ ‘అద్భుతం’!

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.